Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది. ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్రావు అధ్యక్షతన సమావేశం మొదలైంది. ఈ నెల 31 నుంచి కేంద్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్రం పార్లమెంటులో బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది.
ఈ తరుణంలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంటులో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ర్టానికి సంబంధించి పార్లమెంట్లో చర్చించాల్సిన విషయాలు ముఖ్యంగా బడ్జెట్లో కేటాయింపులు, కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన నిధులు, కేంద్రం నెరవేర్చని విభజన హామీలు తదితర అంశాలు సమావేశంలో చర్చకు రానున్నాయి.