Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ప్రపంచ క్రికెట్ లో భారత అమ్మాయిలు సత్తా చాటారు. దక్షిణాఫ్రికాలో జరిగిన ఐసీసీ మహిళల అండర్-19 టీ20 వరల్డ్ కప్ లో భారత్ చాంపియన్ గా ఆవిర్భవించింది. ఇవాళ పోచెఫ్ స్ట్రూమ్ లో ఇంగ్లండ్ అమ్మాయిలతో జరిగిన ఫైనల్లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత ఇంగ్లండ్ ను 17.1 ఓవర్లలో 68 పరుగులకే కుప్పకూల్చిన భారత్... ఆపై స్వల్ప లక్ష్యాన్ని 14 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ షెఫాలీ వర్మ 15, మరో ఓపెనర్ శ్వేతా సెహ్రావత్ 5 పరుగులు చేశారు. ఆ తర్వాత తెలుగమ్మాయి గొంగడి త్రిష 24 పరుగులతో భారత్ విజయంలో కీలకపాత్ర పోషించింది. సౌమ్యాతివారి 24 పరుగులతో అజేయంగా నిలిచి భారత్ ను గెలుపుతీరాలకు చేర్చింది. మహిళల అండర్-19 విభాగంలో తొలిసారి నిర్వహించిన ఈ టీ20 వరల్డ్ కప్ ను భారత చేజిక్కించుకోవడం విశేషం.