Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
భాగ్యనగరంలో ఐటీ సోదాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి నివాసం సహా పలుచోట్ల సోదాలు జరుగుతున్నాయి. రాజ్పుష్ప లైఫ్ స్టైల్ సిటీలో ఐటీ తనిఖీలు చేపట్టింది. రాజ్పుష్ప, ముప్పా కన్స్ట్రక్షన్స్, వెరిటెక్స్ సంస్థలు సహా పలు సంస్థల్లో సోదాలు జరుగుతున్నాయి. 40 బృందాలుగా విడిపోయి ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆఫీసులు, మేనేజింగ్ డైరెక్టర్లు, పీఏల ఇళ్లలోనూ తనిఖీలు నిర్వహించారు.
మరోవైపు నగరంలోని వసుధ ఫార్మాలో ఐటీ సోదాలు ముగిశాయి. నిన్న ఉదయం నుంచి ఈరోజు వరకు అధికారులు వసుధ ఫార్మాలో సోదాలు నిర్వహించారు. వసుధ గ్రూప్స్ సీఈవో, డైరెక్టర్లు, మేనేజింగ్ డైరెక్టర్ల ఇళ్లలో తనిఖీలు చేశారు. 50కి పైగా ఐటీ అధికారుల బృందాలు ఎస్ఆర్నగర్లోని ప్రధాన కార్యాలయంతో పాటు మాదాపూర్, జీడిమెట్లలోని కంపెనీ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఈరోజు ఉదయానికి సోదాలు ముగియగా... ఐదేళ్ల ఐటీ రిటర్న్స్పై విచారణ కొనసాగుతోంది.