Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
దేశ ఆర్థిక వృద్ధిలో ఎంతో కీలకమైన 2023-24 ఆర్థిక సంవత్సరానికిగానూ కేంద్ర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ యువత, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాలకు ఆశాదీపం అని బడ్జెట్ ప్రసంగం సందర్భంగా కేంద్ర మంత్రి తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు సంస్థలకూ కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు చేశారు. ఈ క్రమంలో కేంద్ర పన్నుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా రూ. 41, 338 కోట్లు కాగా, తెలంగాణ వాటా రూ. 21,470 కోట్లుగా ఉంది.
తెలంగాణ సంస్థలకు కేటాయింపులు : సింగరేణి - రూ.1,650 కోట్లు, ఐఐటీ హైదరాబాద్ - 300 కోట్లు, మణుగూరు, కోట భారజల కర్మాగారాలకు - రూ. 1,473 కోట్లు,
తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి కేటాయింపులు: రెండు రాష్ట్రాల్లోని గిరిజన విశ్వవిద్యాలయాలు - రూ. 37 కోట్లు, మంగళగిరి, బిబినగర్ సహా దేశంలోని 22 ఎయిమ్స్ ఆస్పత్రులకు - రూ. 6,835 కోట్లు, సాలార్జంగ్ సహా అన్ని మ్యూజియాలకు - రూ. 357 కోట్
ఏపీ సంస్థలకు కేటాయింపులు: ఏపీ సెంట్రల్ యూనివర్సిటీ - రూ. 47 కోట్లు, పెట్రోలియం యూనివర్సిటీ - రూ. 168 కోట్లు