Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - శ్రీనగర్
జమ్ముకశ్మీర్లో గత నాలుగురోజులుగా భారీగా మంచు కురుస్తున్నది. దీంతో లోయలోని నాలుగు జిల్లాల్లో అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీచేశారు. రానున్న 24 గంటల్లో బారాముల్లా, గందర్బల్, కుప్వారా, బండిపొర మీదుగా 2,400 మీటర్ల ఎత్తులో ప్రమాద స్థాయితో హిమపాతం సంభవించే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ హెచ్చరించింది. అందువల్ల ఈ నాలుగు జిల్లాల్లో భారీ హిమపాతం సంభవించే ప్రాంతాలకు ప్రజలు వెళ్లవద్దని సూచించింది. కాగా, ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన గుల్మార్గ్లోని అఫర్వత్ పర్వతం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. భారీ చరియ విరగడంతో పోలండ్కు చెందిన ఇద్దరు పర్యాటకులు మృతిచెందారు. మరో 19 మంది పర్యాటకులు గాయపడ్డారు. అధికారులు వారిని దవాఖానకు తరలించారు.