Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హెచ్ యూ జే 2023 డైరీని ఆవిష్కరించిన మంత్రి హరీష్ రావు
- మంత్రులు ప్రశాంత్ రెడ్డి , నిరంజన్ రెడ్డి , సబితా ఇంద్రా రెడ్డి తదితరులు హాజరు
నవతెలంగాణ హైదరాబాద్:
జర్నలిస్టుల హెల్త్ కార్డులు , ఇండ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుంటుందని రాష్ట్ర , వైద్య ఆరోగ్య,ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఇప్పటికే హెల్త్ స్కీమ్ , ఇండ్ల స్థలాలు ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయని .. అందరికి మేలు జరిగేలా సీఎం కెసిఆర్ నిర్ణయం ఉంటుందని పేర్కొన్నారు. హైదరాబాద్ యూనియన్ అఫ్ జర్నలిస్ట్స్ (హెచ్ యూజే , టిడబ్ల్యూజేఎఫ్ ) 2023 సవంత్సరం డైరీని మంత్రి హరీష్ రావు ఇతర మంత్రులు ప్రశాంత్ రెడ్డి , నిరంజన్ రెడ్డి , సబితా ఇంద్రా రెడ్డిలతో కలిసి గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రయివేట్ హాస్పిటల్స్ లో జర్నలిస్టుల హెల్త్ కార్డులను పూర్తి స్థాయిలో అనుమతించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఆవిష్కరణలో హెచ్ యూజే అధ్యక్షులు అరుణ్ కుమార్ , కార్యదర్శి జగదీష్ , కోశాధికారి బి.రాజశేఖర్ , ఉపాధ్యక్షులు రమేష్ , జాయింట్ సెక్రటరీ క్రాంతి , టీడబ్ల్యూజేఎఫ్ రాష్ర్ట కార్యదర్శి చంద్రశేఖర్ , ఈసీ మెంబర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.