Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : రాష్ట్రంలో నిర్వహించనున్న గ్రూప్-4 పరీక్ష తేదీని టీఎస్పీఎస్సీ (రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్) గురువారం ప్రకటించింది. జులై 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. పేపర్-1 పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు కాగా, పేపర్-2 పరీక్ష మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు పేర్కొంది. గ్రూప్-4 పరీక్షకు ఇప్పటికే 9 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రాథమికంగా నిర్ణయించారు. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ భాషల్లో ఈ పరీక్ష ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో 8 వేలకు పైగా ఉద్యోగాల కోసం ఈ గ్రూప్-4 పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, వార్డ్ ఆఫీసర్ తదితర ఉద్యోగాలు ఉన్నాయి. వీటన్నింటి కోసం డిసెంబర్ 1న నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తుల ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. రేపటితో దరఖాస్తుల ప్రక్రియ ముగియనుంది. భారీ ఎత్తున అభ్యర్థులు పోటీ పడుతుండటంతో పరీక్షలకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు.