Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలు నేటినుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని పలు మార్గాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నేటి నుంచి అసెంబ్లీ సమావేశాల ముగిసే వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. ఆదివారాలు మినహా ప్రతిరోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అసెంబ్లీ పరిసరాల్లోని మార్గాల్లో వాహనాల మళ్లింపులు ఉంటాయి. దీంతో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.
ఆంక్షలు ఉండే మార్గాలు..
తెలుగుతల్లి- ఇక్బాల్ మినార్-రవీంద్రభారతి- వీవీ విగ్రహం-షాదన్ కాలేజీ- నిరంకారి-సైఫాబాద్ పాతపోలీస్స్టేషన్- మాసబ్ట్యాంక్- పీటీఐ బిల్డింగ్-అయోధ్య
నిరంకారి-న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్- బషీర్బాగ్ జంక్షన్ టు ఓల్డ్ పీసీఆర్ జంక్షన్
బీజేఆర్ విగ్రహం- ఏఆర్ పెట్రోల్పంప్- నాంపల్లి రైల్వేస్టేషన్- ఎంజేమార్కెట్- తాజ్ ఐలాండ్- బీఆర్కే భవన్- ఆదర్శ్నగర్- ఓల్డ్ పీసీఆర్జంక్షన్
మినిస్టర్స్ రెసిడెన్సీ కాంప్లెక్స్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12- విరంచి హాస్పిటల్- మాసబ్ట్యాంక్ జూబ్లీహిల్స్ చెక్పోస్టు-కేబీఆర్పార్క్-ఎల్వీప్రసాద్ ఐ హాస్పిటల్- శ్రీనగర్ కాలనీ జంక్షన్- నిమ్స్ - వీవీ విగ్రహం
ఈఎస్ఐ దవాఖాన- ఎస్ఆర్ నగర్ మెట్రోస్టేషన్-అమీర్పేట్ స్టేషన్- పంజాగుట్ట జంక్షన్- నిమ్స్- వీవీ విగ్రహం- సీటీవో జంక్షన్- ప్యారడైజ్- రాణిగంజ్- కర్బలా- చిల్డ్రన్పార్క్- ట్యాంక్బండ్- అంబేడ్కర్ విగ్రహం-తెలుగుతల్లి -ఇక్బాల్మినార్-రవీంద్రభారతి ప్లాజా జంక్షన్- ప్యాట్నీ- బాటా- బైబిల్హౌస్- కర్బలా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి.