Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : భారత చలన చిత్ర పరిశ్రమలో విరబూసిన స్వర్ణకమలం కె.విశ్వనాథ్ అని హాస్యనటుడు బ్రహ్మానందం అన్నారు. కళాతపస్వి మృతికి ఆయన సంతాపం తెలిపారు. 'విశ్వనాథ్ దర్శకత్వంలో నేను రెండు సినిమాల్లో నటించా. నేనంటే ఆయనకు ఎంతో అభిమానం. నెలరోజుల కిందటే కలిశా. పుట్టిన ప్రతి వాడూ చనిపోక తప్పదు. కానీ, అద్భుతమైన మరణాన్ని పొందిన కె.విశ్వనాథ్ కళ బతికున్నంత కాలం, కళాకారులు బతికున్నంత కాలం మనతోనే ఉంటారు. భారత చలన చిత్ర పరిశ్రమలో విరబూసిన స్వర్ణకమలం ఆయన' అని అన్నారు.