Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఇంజిన్ లో మంటలు చెలరేగడంతో ఎయిరిండియా విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. పైలట్ ముందుగా గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ రోజు అబు దాబీ ఎయిర్ పోర్టులో జరిగిందీ ఘటన. అబుదాబీ నుంచి కాలికట్ కు ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ బీ737-800 ఎయిర్ క్రాఫ్ట్ బయల్దేరింది. అయితే టేకాఫ్ తీసుకున్న తర్వాత సుమారు వెయ్యి అడుగుల ఎత్తులో ఉండగా.. మొదటి ఇంజిన్ లో మంటలు చెలరేగినట్లు సిబ్బంది గుర్తించారు. దీంతో అబు దాబీ ఎయిర్ పోర్టులో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది అని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఓ ప్రకటనలో తెలిపింది. ఘటన జరిగిన సమయంలో 184 మంది ప్రయాణికులు విమానంలో ఉన్నట్లు ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ తెలిపింది. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని, ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారని వెల్లడించింది.