Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ
విమానం సుమారు మూడు గంటలు ఆలస్యంగా టేకాఫ్ అయ్యింది. ఈ తరుణంలో ప్రయాణికులు, విమాన సిబ్బంది మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. స్పైస్జెట్కు చెందిన విమానం షెడ్యూల్ ప్రకారం శుక్రవారం ఉదయం 7.20 గంటలకు ఢిల్లీ విమానాశ్రయం నుంచి పాట్నాకు బయలుదేరాల్సి ఉంది.
అయితే తొలుత వాతావరణ పరిస్థితుల కారణంగా విమానం టేకాఫ్ ఆలస్యం అవుతుందని సిబ్బంది తెలిపారు. గంట తర్వాత సాంకేతిక సమస్యల వల్ల విమానం ఆలస్యంగా బయలుదేరుతుందని, ఈ క్రమంలో విమానంలోకి ఎక్కి రెండున్నర గంటలకుపైగా నిరీక్షించిన ప్రయాణికులు ఆగ్రహంతో రగిలిపోయారు. స్పైస్జెట్ సిబ్బందిపై తమ అసంతృప్తి వ్యక్తం చేసి ఆందోళనకు దిగారు. దీంతో ప్రయాణికులు, సిబ్బంది మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు ఉదయం 10.10 గంటలకు ఆ విమానం టేకాఫ్ అయ్యింది.