Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: తెలంగాణ శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ముందు అసెంబ్లీ లాబీలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల, రఘునందన్రావు, రాజాసింగ్ మాట్లాడుకుంటుండగా.. వారి వద్దకు మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా వచ్చి మాట్లాడారు. ఈ సందర్భంగా వారి మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. 'హుజూరాబాద్లో జరిగిన అధికారిక కార్యక్రమంలో ఎందుకు పాల్గొనలేదు` అని ఈటలను కేటీఆర్ ప్రశ్నించగా.. 'పిలిస్తే కదా హాజరయ్యేది` అంటూ ఈటల సమాధానమిచ్చినట్టు సమాచారం.
వారి మధ్య సంభాషణ జరుగుతుండగానే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అక్కడికి వెళ్లారు. తనను సైతం అధికారిక కార్యక్రమాలకు పిలవడం లేదని ఆయన ప్రస్తావించారు. మళ్లీ ఈటల కలుగజేసుకుని కనీసం కలెక్టర్ నుంచైనా ఆహ్వానం ఉండాలన్నారు. ఆయన వ్యాఖ్యలకు కేటీఆర్ నవ్వి ఊరుకున్నారు. ఆ తర్వాత రాజాసింగ్, కేటీఆర్ మధ్య సరదా సంభాషణ జరిగింది. రాజాసింగ్ వేసుకొచ్చిన కాషాయ రంగు చొక్కా ఉద్దేశించి, ' మీ చొక్కా రంగు కళ్లకు గుచ్చుకుంటుంది.. ఆ రంగు తనకు ఇష్టం ఉండదు` అని కేటీఆర్ అంటే, 'భవిష్యత్లో మీరూకాషాయ రంగు చొక్కా వేసుకోవచ్చేమో` అని రాజాసింగ్ సరదాగా బదులిచ్చారు. కేటీఆర్ కంటే ముందు డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ వచ్చి ఈటలతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విధానాలు ప్రజల్లోకి వెళ్లే ప్రాక్టీస్ సరిగా లేదని కేటీఆర్కు ఈటల హితవు పలికారు.