Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- అమరావతి
ఏపీ మద్యం దుకాణాల్లో ఆన్ లైన్ చెల్లింపుల వ్యవస్థ ప్రారంభమైంది. రాష్ట్ర ఆబ్కారీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ నేడు మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులను ప్రారంభించారు. తొలివిడతలో 11 మద్యం దుకాణాల్లో ఆన్ లైన్ లావాదేవీలు ఉంటాయని రజత్ భార్గవ తెలిపారు.
అనంతరం, 3 నెలల్లో అన్ని మద్యం దుకాణాల్లో డిజిటల్ లావాదేవీలు ప్రవేశపెడతామన్నారు. ఈ తరుణంలో మద్యం దుకాణాల్లో ఆన్ లైన్ చెల్లింపుల కోసం ఎస్ బీఐ సహకారం తీసుకుంటున్నామని వివరించారు. డెబిట్ కార్డు, యూపీఐ లావాదేవీలకు అదనపు చార్జీలు ఉండవని రజత్ భార్గవ స్పష్టం చేశారు.