Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : కల్యాణ్ రామ్ హీరోగా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో 'అమిగోస్' సినిమా రూపొందింది. మైత్రీ మూవీస్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కల్యాణ్ రామ్ డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు. అందుకు సంబంధించి వదిలిన పోస్టర్లు సినిమాపై ఆసక్తిని పెంచాయి. గిబ్రాన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను, ఈ నెల 10వ తేదీన విడుదల చేయనున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ఈ సినిమా ప్రమోషన్స్ ను మరింత వేగవంతం చేశారు. అందులో భాగంగానే ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. 'మనిషిని పోలిన మనుషులు ఎదురుపడితే అరిష్టం' .. 'మనం ఫ్రెండ్స్ కాదు .. బ్రదర్స్ అంతకన్నా కాదు' ..అనే డైలాగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. తనని పోలిన మనుషుల వలన హీరో చిక్కుల్లో పడతాడనే విషయం ఈ ట్రైలర్ వలన అర్థమవుతోంది. ఈ సినిమాతో ఆషిక రంగనాథ్ కథానాయికగా పరిచయమవుతోంది. క్రితం ఏడాది 'బింబిసార' సినిమాతో హిట్ కొట్టిన కల్యాణ్ రామ్, ఈ సినిమాతో ఆ విజయాన్ని కంటిన్యూ చేస్తాడేమో చూడాలి.