Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -హైదరాబాద్
తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ తరుణంలో ప్రముఖ నిర్మాత ఆర్.వి.గురుపాదం (53) కన్నుమూశారు. శనివారం ఉదయం గుండెపోటు రావడంతో బెంగళూరులోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. సినీ ప్రముఖులు, నెటిజన్లు ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తున్నారు. తెలుగులో తెరకెక్కిన వయ్యారి భామలు వగలమారి భర్తలు, పులి బెబ్బులి చిత్రాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడలో సుమారు 25 చిత్రాలను ఆయన నిర్మించారు.