Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
భారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ పై అంతర్జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఏటీఏ) 21 నెలల నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఆమె నిషేధిత పదార్థాలు తీసుకున్నట్లు పరీక్షల్లో తేలడంతో ఏటీఏ ఈ మేరకు చర్యలు తీసుకుంది. దీపాపై ఈ ఏడాది జులై 10 వరకు నిషేధం అమలులో ఉంటుందని తెలిపింది.
ఈ తరుణంలో తాజాగా దీపా కర్మాకర్ ట్విటర్లో ఓ పోస్టు చేసింది. ఈ రోజు నా కోసం, నా కెరీర్ కోసం నేను చేసిన సుదీర్ఘ పోరాటానికి ముగింపు లభించింది. 2021 అక్టోబర్లో నా నుంచి శాంపిల్స్ తీసుకుని పరీక్షించడానికి పంపారు. నేను నిషేధిత పదార్థాన్ని తీసుకున్నట్లు అందులో తేలింది. అది ఎలా నా శరీరంలోకి చేరిందో గుర్తించలేకపోయాను. నాపై రెండేళ్లు సస్పెన్షన్ విధించినట్లు చాలా మీడియా సంస్థల్లో వార్తలొస్తున్నాయి. అవన్నీ తప్పుడు కథనాలు. నా శిక్షా కాలాన్ని మూడు నెలలు తగ్గించారు. దీంతో జూలై 2023లో తిరిగి నాకిష్టమైన ఆటను మళ్లీ మొదలుపెడతానన్నారు.