Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సిమ్లా
కొండచరియలు విరిగిపడటంతో ఒక వంతెన కూలింది. దీంతో ఆ జాతీయ రహదారిపై ఇరువైపులా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. హిమాచల్ ప్రదేశ్లోని చంబా జిల్లాలో ఆదివారం ఉదయం ఈ సంఘటన జరిగింది. భర్మూర్ గ్రామంలోని లూనా ప్రాంతంలో జాతీయ రహదారి 154ఏ మార్గంలోని వంతెనపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ సంఘటనలో ఆ బ్రిడ్జీ పూర్తిగా కూలిపోయింది. దీంతో చంబా-భర్మూర్ జాతీయ రహదారిపై ఇరువైపులా పలు వాహనాలు నిలిచిపోయాయి.
కాగా, ఈ విషయం తెలిసిన వెంటనే చంబా జిల్లా ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ అధికారులు సంఘటనా స్థలానికి వెళ్లారు. కొండచరియలు విరిగిపడటంతో 20 మీటర్ల పొడవైన బ్రిడ్జీ కూలిందని చంబా డిప్యూటీ కమిషనర్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఒక కారు, లారీ కూడా లోయలో పడినట్లు చెప్పారు. వంతెన కూలడంతో జాతీయ రహదారి కనెక్టవిటీ పూర్తిగా దెబ్బతిన్నదని వెల్లడించారు. మరోవైపు ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.