Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - వైరా
ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వ్యవహారం మరింత ముదిరింది. ముఖ్యమంత్రి కేసీఆర్పై తిరుగుబావుటా ఎగురవేసిన పొంగులేటి వర్గంపై బీఆర్ఎస్ బహిష్కరణ అస్త్రం ప్రయోగించింది. వైరా నియోజకవర్గానికి చెందిన 20 మంది ముఖ్య నాయకులను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర మార్క్ఫెడ్ వైస్ ఛైర్మన్ బొర్రా రాజశేఖర్, వైరా పురపాలక ఛైర్మన్ జైపాల్తో పాటు మరో 18 మందిని బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసింది. గత కొన్ని రోజులుగా పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి, బీఆర్ఎస్ అధిష్ఠానికి మధ్య పొసగడం లేదు. మండల స్థాయి నాయకులతో మంతనాలు సాగిస్తున్న పొంగులేటి పార్టీ నుంచి దూరంగా జరిగేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం దాదాపు 5 మండలాల నేతలు పొంగులేటితో సమావేశమయ్యారు. పలువురు ముఖ్య నేతలు, బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధలు ఈ సమావేశంలో పాల్గొనడంపై అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పొంగులేటితో సమావేశమైన నేతలను సస్పెండ్ చేస్తున్నట్లు ఆయా మండల పార్టీ అధ్యక్షులు ప్రకటించారు.