Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : గిరిజన బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఆటో డ్రైవర్పై బంజారాహిల్స్ పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్కు చెందిన మహమ్మద్ అమీర్ ఆటో డ్రైవర్. ప్రతి రోజూ స్కూల్కు పిల్లలను ఆటోలో తీసుకెళ్తాడు. నగరంలో ఓ బాలిక (10) తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. ఆదివారం ఇంట్లో బాలిక ఒంటరిగా ఉండడం గమనించిన అమీర్ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వారు వెంటనే బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.