Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : బులియన్ మార్కెట్లో బంగారం పరుగులు ఎవరికీ తెలియనివి కాదు. ఈ ఏడాది ఏమంటా ప్రారంభమైందో కానీ బంగారానికి రెక్కలొచ్చాయి. గతంలో ఎన్నడులేనంతగా పసిడి, వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. అయితే మొన్నటి నుంచి మాత్రం బంగారం ధర దిగి వస్తోంది. మొన్న రూ.500 వరకూ తగ్గితే నిన్న ఏకంగా 700 వరకూ తగ్గింది. ఇక నేడు స్థిరంగా ఉంది. రేపటి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి నేడు కొనడమే ఉత్తమం. నేడు దేశంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,400 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,160 గా ఉంది. దేశీయంగా కిలో వెండి ధర రూ.71,200 లుగా కొనసాగుతోంది.