Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢీల్లి
రూ.20 వేల కోట్ల వ్యయంతో నిర్మించిన ఐఎన్ఎస్ విక్రాంత్ను గతేడాది సెప్టెంబర్లో నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. 262 మీటర్ల పొడవు, 62 మీటర్ల వెడల్పుతో ఐఎన్ఎస్ విక్రాంత్ భారత్లో నిర్మించిన అతిపెద్ద యుద్ధనౌక. మిగ్-29కే, హెలికాప్టర్లతో సహా 30 యుద్ధ విమానాలను ఇది మోసుకెళ్లగలదు. ప్రస్తుతం ఈ యుద్ధనౌకపై ఏవియేషన్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు.
ఈ తరుణంలో భారత మొట్టమొదటి స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ కీలక మైలురాయి దాటింది. నౌకాదళ స్వదేశీ తేలికపాటి యుద్ధ విమానం ఒకటి గురువారం ఐఎన్ఎస్ విక్రాంత్పై తొలిసారి ల్యాండ్ అయింది. ఓ ఫిక్స్డ్ వింగ్ ఎయిర్క్రాఫ్ట్ ఈ నౌకపై ల్యాండ్ కావడం కూడా ఇదే తొలిసారి. ఐఎస్ఎస్ విక్రాంత్పై నావికాదళ పైలట్లు తేలికపాటి యుద్ధవిమానాన్ని(నేవీ) విజయవంతంగా ల్యాండ్ చేశారు. దీని ద్వారా ఆత్మనిర్భర్ భారత్ దిశగా నౌకాదళం మరో చారిత్రక మైలురాయి దాటింది అని భారత నౌకాదళం ఓ ప్రకటనలో తెలిపింది. స్వదేశీ విమాన వాహక నౌకలు, యుద్ధ విమానాల రూపకల్పన, నిర్మాణం, నిర్వహణ విషయంలో భారత్ సామర్థ్యాన్ని ఇది ప్రదర్శిస్తుందని తెలిపింది.