Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- హైదరాబాద్
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మాడ్గుల మండలం చంద్రయానపల్లి వద్ద సోమవారం సాయంత్రం ఆటో-టాక్టర్ ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆస్పతికి తరలించారు. మృతులను మాడ్గుల మండలానికి చెందిన సత్యనాయక్, శాంతి, అభి (7)గా గుర్తించారు. పోలీసులు సంఘటపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.