Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
నిర్వహణ సమస్యల వల్ల పలు ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. మొత్తం 17 సర్వీసులను రద్దు చేసినట్లు తెలిపారు. లింగంపల్లి - హైదరాబాద్ మార్ంలో 2 సర్వీసులు, హైదరాబాద్ - లింగంపల్లి మార్గంలో 7 సర్వీసులు, లింగంపల్లి - ఫలక్నూమా మార్గంలో 6 సర్వీసులు, ఫలక్నూమా - రామచంద్రాపురం మార్గంలో ఒక్క సర్వీసు, ఫలక్నుమా - హైదరాబాద్ మార్గంలో ఒక్క సర్వీసును రద్దు చేశారు. రెగ్యులర్గా ఎంఎంటీఎస్ సర్వీసుల్లో ప్రయాణించే ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అధికారులు సూచించారు.