Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఫాం హౌస్ కేసులో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేసును సీబీఐకు అప్పగిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పిటిషన్ ను వెంటనే విచారణకు స్వీకరించాలని ప్రభుత్వ తరుపు న్యాయవాది దుష్యంతు దవే సీజేఐ ధర్మాసనాన్ని కోరారు. ఈ కేసులో సీబీఐ విచారణ జరిపితే సాక్ష్యాలన్నీ ధ్వంసం అవుతాయని పిటిషన్ లో ఆందోళన వెలిబుచ్చారు. ఈ విషయాలను బుధవారం ధర్మాసనం దృష్టికి తెస్తే వచ్చే వారం విచారణకు అనుమతిస్తామని సీజేఐ స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకు అప్పగించాలన్న తీర్పుపై స్టే విధించాలంటూ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో సవాల్ చేసేందుకు 3 వారాల గడువు కోరింది. ఉదయం హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేసిన సర్కారు సాయంత్రానికి సుప్రీంను ఆశ్రయించింది.