Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించారు. ఈనెల 11 నుంచి ట్యాంక్బండ్, నెక్లెస్రోడ్, ప్యారడైజ్, నిజాం కాలేజీ ప్రాంతాల్లో ఈ బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. మొత్తం 6 ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సుల కోసం హెచ్ఎండీఏ ఆర్డర్ ఇవ్వగా ప్రస్తుతం 3 బస్సులు అందుబాటులోకి వచ్చాయి. త్వరలో మిగిలిన 3 బస్సులు కూడా అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు. నగరంలో మొత్తం డబుల్ డెక్కర్ బస్సులు 20కి పెంచాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది. ఒక్కో బస్సును రూ.2.16కోట్లతో కొనుగోలు చేశారు. బస్సులో డ్రైవర్తో పాటు 65 మంది ప్రయాణికులకు సీటింగ్ సామర్థ్యం ఉంది. ఒక సారి ఛార్జింగ్ చేస్తే 150 కి.మీ ప్రయాణించవచ్చని, 2 నుంచి 2.5 గంటల్లో పూర్తిగా ఛార్జింగ్ పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ తదితరులు పాల్గొన్నారు.