Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన సచివాలయం మొదటి బ్లాక్లో క్యాబినెట్ సమావేశం మందిరంలో ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం భేటీ అయ్యింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రధానంగా 70 అజెండా అంశాలపై క్యాబినెట్ చర్చించనుంది. రాష్ట్రంలో భారీ పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనలకు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు ప్రతిపాదనలకు క్యాబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. సుమారు రూ. లక్షా 45 వేల కోట్ల పెట్టుబడులకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.