Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానంగా 70 అజెండా అంశాలపై క్యాబినెట్ చర్చించింది. ఈ తరుణంలో వైఎస్సార్ కల్యాణమస్తు పథకంలో గతం కంటే ఎక్కువ ఇస్తున్నామని, కర్నూలులో జాతీయ న్యాయ విద్యాలయం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు.
- కర్నూలు జిల్లా డోన్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో బోధనా సిబ్బంది నియామకానికి కేబినెట్ ఆమోదం
- ఈ నెల రైతులకు ఇన్ఫుట్ సబ్సీడీ చెల్లింపునకు కేబినెట్ ఆమోదం
- ఈ నెల 28న జగనన్న విద్యాదీవెన చెల్లింపునకు కేబినెట్ ఆమోదం
- 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థుల పోస్టుల భర్తీకి ఆమోదం
- డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం
- విశాఖలో టెక్ పార్క్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం
- నెల్లూరు బ్యారేజ్ను నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి బ్యారేజ్గా మారుస్తూ నిర్ణయం
- రామాయపట్నం పోర్టులో 2 క్యాపిటివ్ బెర్త్ల నిర్మాణానికి ఆమోదం
- లీగల సెల్ అథారిటీలో ఖాళీ పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం
- పంప్ స్టోరేజ్ హైడ్రో ప్రాజెక్టులకు అవసరమైన అనుమతులకు ఆమోదం