Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - విశాఖ
కొరాపుట్ జిల్లా పొట్టంగి బ్లాక్ సొరడ గ్రామానికి చెందిన ఈడె గురు (30) కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె భర్త సాములు వారం క్రితం భార్యను విశాఖ జిల్లా తగరపువలసలో ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవడం చేతిలో డబ్బులు లేకపోవడంతో బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి చేశారు. సాలూరు వెళ్లి, అక్కడి నుంచి సొంతూరుకు మరో వాహనంలో వెళ్దామని ఆటో మాట్లాడుకున్నారు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం రామవరం వంతెన వద్దకు చేరుకోగానే గురు మృతిచెందారు. ఆటో డ్రైవర్ మృతదేహాన్ని అక్కడే దింపేసి వెళ్లిపోయాడు
ఏం చేయాలో తెలియక భార్య మృతదేహాన్ని సాములు భుజాన వేసుకొని బయలుదేరాడు. దారిలో ఎదురైనవారిని సాలూరు ఎటువైపని అడిగాడు. అతనికి తెలుగు రాకపోవడంతో అడిగేది ఎవరికీ అర్థం కాలేదు. తిరిగి నాలుగు కిలోమీటర్లు వెనక్కి వెళ్లాడు. అటువైపు వెళ్లేవారు గమనించి గంట్యాడ పోలీసులకు తెలిపారు. సీఐ టి.వి.తిరుపతిరావు, గంట్యాడ ఎస్సై కిరణ్కుమార్ రామవరం వద్దకు చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. ఆయనకు భోజనం పెట్టించారు. ప్రయివేటు అంబులెన్సు మాట్లాడి 125 కిలోమీటర్ల దూరంలోని స్వగ్రామానికి పంపించారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని పాచిపెంట సీఐ, ఎస్సైలకు సమాచారమిచ్చారు. బాధితుడి బంధువులకు తెలియజేయాలని, అవసరమైన సహకారం అందించాలని కోరారు.