Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నాగ్పూర్
నాలుగు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా నాగ్పూర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో భారత్ బౌలింగ్కు దిగనుంది. ఇక ఈ మ్యాచ్ద్వారా సూర్యకుమార్, తెలుగు కుర్రాడు శ్రీకర్ భరత్ టెస్టు మ్యాచుల్లోకి అరంగేట్రం చేస్తున్నారు. ఐదు నెలల సుదీర్ఘ విరామం తర్వాత రవీంద్ర జడేజా జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు.
భారత్: రోహిత్ (కెప్టెన్), కేఎల్ రాహుల్, పుజారా, కోహ్లీ, జడేజా, సూర్యకుమార్, భరత్, అశ్విన్, అక్షర్ పటేల్, షమీ, సిరాజ్.
ఆస్ట్రేలియా: కమిన్స్ (కెప్టెన్), వార్నర్, ఖవాజా, లబుషేన్, స్మిత్, మ్యాట్ రెనషా, హ్యాండ్స్కోంబ్, అలెక్స్ కారీ, లియాన్, మర్ఫీ, బొలాండ్.