Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : నాగ్పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి టెస్టు మ్యాచ్లో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టుల్లో ఆరుదైన ఘనత సాధించాడు. 450 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ఆసీస్ ఆటగాడు అలెక్స్ క్యారీని ఔట్ చేసి అశ్విన్ ఆ ఘనతను సాధించాడు. 450 వికెట్లు తీయడంతో అశ్విన్ పలు రికార్డులు సృష్టించాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 450 వికెట్లు సాధించిన మొదటి భారత బౌలర్గా నిలిచాడు. 88 టెస్టుల్లో అశ్విన్ ఈ ఘనతను సాధించాడు. అంతకుముందు ఈ రికార్డు అనిల్ కుంబ్లే పేరిట ఉండేది. కుంబ్లే 93 టెస్టు మ్యాచ్ లో 450 వికెట్ల మార్క్ ను అందుకున్నాడు. ఇక ప్రపంచ క్రికెట్ లో ఈ ఘనత సాధించిన రెండో బౌలర్ గా అశ్విన్ నిలిచాడు. తొలి స్థానంలో శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్(80 మ్యాచ్లు) ఉన్నాడు. ఇక ఓవరాల్గా ప్రపంచ క్రికెట్లో 450 వికెట్ల మైలురాయిని చేరుకున్న 9వ బౌలర్గా అశ్విన్ నిలిచాడు.