Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: ప్రజాప్రతినిధులు, ఉద్యమ నాయకులు, ప్రజలను అనుమతించని ప్రగతిభవన్ గేట్లను.. కచ్చితంగా బద్దలు కొడతామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రగతిభవన్ను నాలెడ్జ్ సెంటర్గా మార్చి.. అంబేడ్కర్ పేరు పెడతామని వెల్లడించారు. రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ప్రభుత్వ భూములను కేటీఆర్ బృందం కొల్లగొట్టిందని.. ఈ ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణకు కేటీఆర్ సిద్ధమా? అని రేవంత్ సవాల్ విసిరారు. కేసీఆర్ భజన మండలిగా అసెంబ్లీ మారిందని విమర్శించారు.