Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో.. చిన్న ఉపగ్రహ వాహకనౌక ఎస్ఎస్ఎల్వీ-డీ2ని ప్రయోగించింది. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా సతీశ్ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ వాహకనౌక 156.3 కిలోల బరువున్న ఈవోఎస్-07 ఉపగ్రహంతోపాటు అమెరికాలోని అంటారిస్ సంస్థకు చెందిన 11.5 కిలోల జానుస్-1, చెన్నై స్పేస్కిడ్జ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రభుత్వ స్కూల్ విద్యార్థులు రూపొందించిన 8.7 కిలోల ఆజాదీశాట్-2ను భూసమీప కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. మొదట 450 కిలోమీటర్ల ఎత్తులో ఈవోఎస్-07 ఉపగ్రహాన్ని, అనంతరం జానుస్-1, ఆజాదీశాట్ను క్షక్ష్యలో ప్రవేశపెడుతుంది. మొత్తం 15 నిమిషాల్లో ప్రయోగం పూర్తికానుంది.