Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-న్యూఢిల్లీ : జాతీయ భద్రత కారణాలతో 2020లో భారత్లో నిషేధానికి గురైన టిక్టాక్ తాజాగా దేశంలో మొత్తం సిబ్బందిని విధుల నుంచి తొలగించింది. భారత్లో టిక్టాక్కు అత్యధిక యూజర్లు ఉన్నారు. భారత్ నుంచి బ్రెజిల్, దుబాయ్ మార్కెట్లకు పనిచేస్తున్న ఉద్యోగులందరిపై టిక్టాక్ వేటు వేసింది.
భారత్లో టిక్టాక్ నిషేధానికి గురైన మూడేండ్ల అనంతరం బైట్డ్యాన్స్కు చెందిన సోషల్ మీడియా యాప్ భారత్లో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ సాగనంపింది. భారత్లో నిషేధంతో మార్కెట్ వాటాను కోల్పోయినప్పటికీ టిక్టాక్ ఇప్పటికీ భారత్లో కార్యాలయాన్ని కొనసాగిస్తోంది. భారత్ కార్యాలయం కేంద్రంగా పనిచేస్తున్న ఉద్యోగులు బ్రెజిల్, దుబాయ్ మార్కట్ల కోసం పనిచేస్తున్నారు. ఇక భారత్లో తిరిగి కార్యకలాపాలు సాగించేందుకు టిక్టాక్ ప్రయత్నాలు ఫలించకపోగా అమెరికాలోనూ యాప్ భవితవ్యంపై సందిగ్ధం నెలకొంది. తమ గ్లోబల్, ప్రాంతీయ సేల్స్ టీమ్స్కు సపోర్ట్ కోసం 2020లో భారత్లో ఏర్పాటు చేసిన రిమోట్ సేల్స్ సపోర్ట్ హబ్ను మూసివేయాలని నిర్ణయించామని టిక్టాక్ ప్రతినిధి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.