Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అస్సాం
బీజేపీ సీఎం హిమంత బిస్వా శర్మ తెలివి తక్కువ చర్యల వల్ల అస్సాంలో అమాయక బాలికలు చనిపోతున్నారని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ విమర్శించారు. ఒక గర్భిణీ బాలిక మరణంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాల్య వివాహాలపై ప్రభుత్వం కఠిన చర్యల వల్ల గర్భం దాల్చిన 18 ఏళ్లలోపు బాలికలు ప్రసవం కోసం ఆస్పత్రులకు వెళ్లడం లేదన్నారు.
తమ తండ్రులు, భర్తలను పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో ఇంటి వద్దే కాన్పులకు ప్రయత్నిస్తూ మరణిస్తున్నారని ట్విట్టర్లో ఆవేదన వ్యక్తం చేశారు. కమ్యూనిటీ సిబ్బంది, ఆశా వర్కర సహాయం లేక బొంగైగావ్ జిల్లాలో 16 ఏళ్ల గర్భిణీ వివాహిత బాలిక చనిపోయిందని తెలిపారు. ప్రసవ సమయంలో వచ్చే సమస్యలు, రక్తస్రావంతో సీరియస్ పరిస్థితిలో ఉన్న ఆ యువతి శిశువును ప్రసవించి మరణించిందని తెలిపారు.