Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తిరుపతి
తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఆన్లైన్ కోటా టికెట్లు ఈనెల 13న ఉదయం 9గంటలకు విడుదల చేయనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో తెలిపింది. ఈనెల 22 నుంచి 28వ తేదీ వరకు విడుదల చేయని రూ.300ల ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటా టికెట్లను సోమవారం విడుదల చేయనున్నట్టు తితిదే అధికారులు తెలిపారు. మార్చి నెలకు సంబంధించి అంగప్రదక్షిణ టోకెన్ల కోటాతో పాటు ఈనెల 23 నుంచి 28 వరకు విడుదల చేయని కోటాను ఫిబ్రవరి 11వ తేదీ ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్టు టీటీడీ అధికారులు వెల్లడించారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆన్లైన్లో టోకెన్లు బుక్ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.