Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో బీడీఎస్ విద్యార్థిని వైశాలి అపహరణ కేసులో నిందితుడు నవీన్ రెడ్డిపై రాచకొండ పోలీసు కమిషనర్ ఆర్.ఎస్.చౌహాన్ పీడీ యాక్ట్ నమోదు చేశారు. డిసెంబరు 9న ఆమె ఇంటిపై దాడి చేసి బలవంతంగా అపహరించిన నవీన్రెడ్డి సహా మొత్తం 32 మందిని ఆదిభట్ల పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ప్రస్తుతం నవీన్రెడ్డి చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. బాధితురాలి ఫొటోలు మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో ఖాతాలు తెరిచి వేధించడం, అపహరణ సహా అతనిపై మొత్తం 5 కేసులు నమోదయ్యాయి.