Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవికి ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ ముదిరాజ్ పేరును బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. ఈనేపథ్యంలో శనివారం నామినేషన్ వేయాల్సిందిగా బండా ప్రకాష్కు ముఖ్యమంత్రి సూచించారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని సంబంధిత పార్టీ నాయకులకు సీఎం కేసీఆర్ తెలిపారు. మండలి డిప్యూటీ చైర్మన్గా వ్యవహరించిన ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్ పదవీకాలం 2021, జూన్ 3న పూర్తయింది. దీంతో అప్పటినుంచి డిప్యూటీ చైర్మన్ పదవి ఖాళీగా ఉన్నది. ఈనేపథ్యంలో డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు శుక్రవారం నోటిఫికేషన్ వెలువడింది. నేడు నామినేషన్లను స్వీకరించనున్నారు. 12న ఉదయం 10 గంటలకు శాసన మండలి ప్రారంభమైన అనంతరం డిప్యూటీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియను పూర్తిచేసి బాధ్యతలు అప్పగించనున్నారు. బండా ప్రకాష్ 2018 మార్చిలో బీఆర్ఎస్ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. అయితే ఎంపీగా ఆరేండ్ల పదవీకాలం పూర్తికాకముందే.. 2021 నవంబర్ ఎమ్మెల్యే కోటాలో శాసన మండలికి ఎంపికయ్యారు. అనంతరం అదేఏడాది డిసెంబర్ మొదటివారంలో తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.