Authorization
Fri May 16, 2025 11:54:59 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : బాధ్యతాయుతమైన పోస్టులో ఉన్న ఓ ఇన్స్పెక్టర్ తన బాధ్యతను మర్చిపోయాడు. తోటి మహిళా ఎస్ఐని వేధించడంతో అతడిని హెడ్క్వార్టర్కు అటాచ్ చేస్తూ నగర సీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. సంతోష్నగర్ ఎస్హెచ్వోగా పనిచేస్తున్న ఇన్స్పెక్టర్ వంశీకృష్ణరావు ఓ మహిళా ఎస్ఐని వేధింపులకు గురిచేస్తున్నాడు. దాంతో ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. విషయం సీపీ దృష్టికి వెళ్లడంతో ప్రాథమిక విచారణ జరిపి సదరు ఇన్స్పెక్టర్ను హెడ్క్వార్టర్కు అటాచ్ చేశారు. పూర్తి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఎస్బీ అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. భవానీనగర్ పోలీ్సస్టేషన్ డీఐ (డిటెక్టివ్ ఇన్స్పెక్టర్)గా పనిచేస్తున్న జి. శేఖర్రెడ్డికి సంతో్షనగర్ ఎస్హెచ్వో బాధ్యతలు అప్పగిస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.