Authorization
Fri May 16, 2025 03:21:17 pm
నవతెలంగాణ - విశాఖపట్టణం
విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఎస్ఎంఎస్-2లో ద్రవ ఉక్కు తీసుకెళ్తున్న లాడిల్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో 8 మంది కార్మికులు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఆరుగురు ఒప్పంద కార్మికులు, ఇద్దరు శాశ్వత ఉద్యోగులు, ఒక డీజీఎం స్థాయి అధికారి ఉన్నారు. లాడిల్లో ద్రవ ఉక్కు తరలిస్తుండగా అకస్మాత్తుగా పేలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. వీరిని తొలుత స్టీల్ ప్లాంట్లోని జనరల్ ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రాథమిక వైద్యం అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నగరంలోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు.