Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ
టర్కీ-సిరియా సరిహద్దులో ఈ నెల 7వ తేదీ తెల్లవారుజామున సంభవించిన భూకంపంపై ఐక్యరాజ్యసమితి స్పందించింది. ఈ భూకంపం చాలా తీవ్రమైనదని, గత వందేళ్లలో ఆ ప్రాంతంలో ఇంతటి తీవ్రమైన భూకంపం సభవించడం ఇదే తొలిసారి అని ఐక్యరాజ్యసమితి తెలిపింది.
ఇవాళ టర్కీలోని భూకంప ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఐరాస అత్యవసర, సహాయక చర్యల చీఫ్ మార్టిన్ గ్రిఫిత్స్ ఖహ్రమాన్మరాస్ ప్రావిన్స్లో మీడియాతో మాట్లాడారు. అదేవిధంగా టర్కీ ప్రభుత్వం నిర్వహిస్తున్న విపత్తు నిర్వహణ చర్యలపై గ్రిఫిత్స్ ప్రశంసలు కురిపించారు. విపత్తు నిర్వహణ చర్యల విషయంలో టర్కీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు అసాధారణంతా ఉందని ఆయన కొనియాడారు.