Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-విశాకపట్నం : విశాక జిల్లాలోని కంచరపాలెం వంతెనపై అర్థరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. స్నేహితుల ఇంటికి వెళ్తుండగా కంచరపాలెం వంతెన సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు అడివి వరంకి చెందిన రామిరెడ్డి, కంచరపాలెం బర్మా క్యాంపుకు చెందిన దినేష్గా పోలీసులు గుర్తించారు. అనంతరం మృతదేహాలను కేజీఎచ్ మార్చురీకి తరలించారు.