Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కరీంనగర్ : జిల్లాలోని కరీంనగర్- వరంగల్ ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ ను టాటాఎస్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. బైక్ ఢీకొట్టిన అనంతరం టాటాఎస్ వాహనం యువకుడిని 50 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. దీంతో తీవ్రగాయాలైన యువకుడు వాహనం ఈడ్చుకెళ్లడంతో మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు శ్రీకాంత్ మిషన్ భగీరథలో పంపు ఆపరేటర్గా పోలీసులు గుర్తించారు. కన్న కొడుకు మృతి చెందిన విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. శ్రీకాంత్ మృతితో స్వస్థలం మానకొండూర్ మండలం కొండపల్క గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.