Authorization
Sat May 17, 2025 04:39:06 am
నవతెలంగాణ - హైదరాబాద్
హైదరాబాద్ నగరంలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. ముంబైకి చెందిన నలుగురు డ్రగ్ స్మగ్లర్లను హైదరాబాద్ నార్కోటిక్ విభాగం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఠా సభ్యుల నుంచి 204 గ్రాముల ఎండీఎంఏను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్ స్మగ్లర్లపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నగరంలోని పలువురు ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేసేందుకు ఈ ముఠా ముంబై నుంచి వచ్చినట్లు తెలుస్తోంది.