Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఢిల్లీ టెస్టు మొదటి ఇన్నింగ్స్లో భారత్ 262 రన్స్ వద్ద ఆలౌట్ అయింది. పర్యాటక ఆస్ట్రేలియాకు ఒక పరుగు ఆధిక్యం లభిచింది. కుహ్నేమాన్, షమీని బౌల్డ్ చేయడంతో భారత ఇన్నింగ్స్ ముగిసింది. కొత్త బంతి తీసుకున్న ఆసీస్ రవిచంద్రన్ ఆశ్విన్ (37), అక్షర్ పటేల్ (74)ను వెంట వెంటనే ఔట్ చేసింది. మర్ఫీ ఓవర్లో సిక్స్ బాదిన అక్షర్ తర్వాతి బంతికి వికెట్ సమర్పించుకున్నాడు. అక్షర్, అశ్విన్ కలిసి ఎనిమిదో వికెట్కు 114 పరుగుల కీలక భాగస్వామ్యం నిర్మించారు. ఆసీస్ బౌలర్లలో లయాన్ ఐదు వికెట్లు తీశాడు, కుహ్నేమాన్, మర్ఫీ తలా రెండు వికెట్లు పడగొట్టారు. కమిన్స్కు ఒక వికెట్ దక్కింది.