Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బెంగళూరు: గుండెపోటుకు గురైన సినీ నటుడు నందమూరి తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు సమాచారం. బాలకృష్ణ సహా కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు. తారకరత్నను బెంగళూరు నుంచి హైదరాబాద్కు తరలించే యోచనలో కుటుంబ సభ్యులు ఉన్నట్టు సమాచారం. దీంతో ఆసుపత్రి వద్ద భద్రతను పెంచడంతో పాటు స్థానిక పోలీసులు కాన్వాయ్ సిద్ధం చేస్తున్నారు. గురువారం తారకరత్నకు ఎం.ఆర్.ఐ స్కానింగ్ చేసిన వైద్యులు ఆరోగ్యం నిలకడగానే ఉందని పేర్కొన్నారు. మెదడుకు సంబంధించిన వైద్య సేవలు కొనసాగించారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి శనివారం అత్యంత విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.