Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బెంగళూరు : ప్రమాదవశాత్తు మణికట్టు వరకు పూర్తిగా తెగి, వేరుపడిన చేతిని వైద్యులు శస్త్రచికిత్సతో విజయవంతంగా అతికించారు. బెంగళూరులో ఓ ఫ్యాక్టరీలో మేనేజర్(55)గా పని చేస్తున్న వ్యక్తి ఇటీవల కొత్తగా వచ్చిన యంత్రాన్ని పరిశీలిస్తుండగా అతని కుడి చేయి అందులో పడి సరిగ్గా మణికట్టు వరకు తెగిపోయింది. బాధితుడిని వెంటనే బెంగళూరులోని బన్నేరుఘట్లో ఫోర్టీస్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు 7గంటల పాటు శస్త్రచికిత్స చేసి చేతిని అతికించారు. అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా చేసినట్లు వైద్యులు సత్య వంశీ కృష్ణ మంగళవారం వెల్లడించారు.