Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఏపీ మాజీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు గన్నవరం ఎయిర్పోర్టులో ప్రభుత్వం వీడ్కోలు పలికింది. బుధవారం ఉదయం గవర్నర్కు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆత్మీయ వీడ్కోలు పలికారు. బిశ్వభూషణ్ చత్తీస్గఢ్ గవర్నర్గా బదిలీ అయిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఆయనకు ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో గవర్నర్ ప్రసంగించారు. ముఖ్యమంత్రి తనపై చూపించిన ప్రేమాభిమానాలను ఎప్పటికీ మరిచిపోలేనని చెప్పారు.