Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : పుట్టినరోజు వేడుకలకు అని చెప్పి బయటకు వెళ్లిన ఇద్దరు యువతులు, ఓ బాలిక అదృశ్యమయ్యారు. ఈ ఘటన సికింద్రాబాద్లోని తిరుమలగిరి పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. తిరుమలగిరి ప్రాంతానికి చెందిన తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ బాలిక తన ఇద్దరు స్నేహితులైన అసీనా, అఖీనా అనే ఇద్దరు యువతులతో కలిసి నిన్న సాయంత్రం బయటకు వెళ్లింది. రాత్రి అయినప్పటికీ వారి తిరిగి ఇంటికి రాలేదు. స్నేహితులు, తెలిసిన వారి వద్ద కుటుంబసభ్యులు, బంధువులు ఆరా తీసినా ఫలితం లేకపోయింది. దీంతో కుటుంబసభ్యులు తిరుమలగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.