Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ
దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో బుధవారం భూకంపం సంభవించింది. నేపాల్ కేంద్రంగా సంభవించిన ఈ భూకంపం తీవ్రత భూకంప లేఖిని పై 4.8గా నమోదైంది. నేపాల్లో ఈ భూకంపం తీవ్రత 5.2గా నమోదైనట్లు జాతీయ మీడియా కథనాలను బట్టి తెలుస్తోంది.
ఈ తరుణంలోనే ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతాల్లో బుధవారం మధ్యాహ్నం 1:30:23 గంటలకు భూకంపం ప్రభావం కనిపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ తెలిపింది. భూకంప కేంద్రం హరిద్వార్లో ఉన్నట్లు తెలిపింది. అయితే అకస్మాత్తుగా భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు.