Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢీల్లి
2023 ఐపీఎల్ సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ నూతన కెప్టెన్ను ఎంపిక చేసుకుంది. రెగ్యులర్ కెప్టెన్ రిషబ్ పంత్ గతేడాది చివర్లో జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, ప్రస్తుతం బెడ్ రెస్ట్లో ఉన్న తరుణంలో ఢిల్లీ క్యాపిటల్స్కు ఈ ఎంపిక అనివార్యమైంది. పంత్ గైర్హాజరీలో డీసీ సారధ్య బాధ్యతలను ఆసీస్ స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్ మోయనున్నట్లు డీసీ యాజమాన్యం వెల్లడించింది.
ఈ విషయాన్ని డీసీ మేనేజ్మెంట్ అధికారికంగా ప్రకటించనప్పటికీ మేనేజ్మెంట్లోని ఓ కీలక వ్యక్తి ప్రముఖ స్పోర్ట్స్ వెబ్సైట్కు తెలిపారు. కెప్టెన్గా డేవిడ్ వార్నర్ను ఎంపిక చేసుకున్న యాజమాన్యం అతనికి డిప్యూటీగా (వైస్ కెప్టెన్) అక్షర్ పటేల్ను ఎంచుకున్నట్లు సదరు వ్యక్తి తెలిపారు.
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), రిపల్ పటేల్, మనీశ్ పాండే, రిలీ రొస్సో, రోవమన్ పావెల్, సర్ఫరాజ్ ఖాన్, పృథ్వీ షా, యశ్ ధుల్, ఫిల్ సాల్ట్, రిషబ్ పంత్, మిచెల్ మార్ష్, అమన్ హకీం ఖాన్, లలిత్ యాదవ్, ఇషాంత్ శర్మ, ముకేశ్ కుమార్, అన్రిచ్ నోర్జే, ముస్తాఫిజుర్ రెహ్మన్, లుంగి ఎంగిడి, ఖలీల్ అహ్మద్, చేతన్ సకారియా, కమలేష్ నాగర్కోటి, ప్రవీణ్ దూబే, కుల్దీప్ యాదవ్, విక్కీ ఓస్వాల్.